

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుండి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలను హాఫ్ డేగా నిర్వహించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం (16వ తేదీ) నుండి పాఠశాలలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని సూచించారు.
అలాగే పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ డాక్టర్ షేక్ సలీం భాష హెచ్చరించారు.
