
మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన తిరుణాల ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మార్వో కిరణ్ కుమార్ మాట్లాడుతూ తిరుణాల సందర్భంగా ముఖ్యంగా ఏడవ తేదీన జరిగే రథోత్సవంను విజయవంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేస్తారని చెప్పారు.
రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని దృష్టిలో ఉంచుకుని భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే ఇతర శాఖల అధికారులతో కలిసి తిరుణాల ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని తిరుణాల నిర్వహణపై తమ బాధ్యతలను వివరించారు
