

మాచర్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరుకాబోతున్న 229 మంది విద్యార్థినీలకు పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మాచర్ల పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర బుక్ డిపో యజమాని షరాబు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బూసా రామాంజనేయులు (అడ్వకేట్) ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినీలకు పరీక్షా సామాగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా షరాబు అనిల్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఉషారాణి, సీనియర్ ఉపాధ్యాయులు పోలా మల్లికార్జున, కృష్ణబాబు, శ్రీహరి, కొండలు, కటకం నరేష్, ఫారుక్, లక్ష్మణ్, నరసింహ సాయి తదితరులు పాల్గొన్నారు
