
మాచర్ల: మాచర్ల నియోజకవర్గ శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం (13-03-2026) నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు మాచర్ల పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో తిరునాళ్ల సందర్భంగా అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
అలాగే సాయంత్రం 5 గంటలకు వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి టెంపుల్ ప్రాంగణంలో నిర్వహించే “అన్నదాత సుఖీభవ” పథకం కింద నియోజకవర్గ రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు.
ఈ మేరకు మాచర్ల నియోజకవర్గ శాసన సభ్యుల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
