
పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిధిలో రెండు రోజుల క్రితం అడిగొప్పల తిరునాళ్లకు వెళ్తూ విష్ణు అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో పాటు ఎక్కువగా రక్తస్రావం జరిగింది.
ప్రస్తుతం విష్ణు నరసరావుపేటలోని జీబీఆర్ (GBR) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి AB+ve బ్లడ్ అత్యవసరంగా అవసరమని బంధువులు, స్నేహితులు మీడియాకు తెలియజేశారు.
ఈ సమాచారానికి స్పందించిన చింతపల్లి గ్రామానికి చెందిన యువకుడు త్రినాథ్ ముందుకు వచ్చి నరసరావుపేటలో రక్తదానం చేసి మానవత్వాన్ని చాటాడు. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చని ఆయన తెలిపారు.
త్రినాథ్ చేసిన ఈ సేవకు విష్ణు బంధువులు, స్నేహితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
