
ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయిన వారికి ఉచితంగా కృత్రిమ పాదాలు అందించేందుకు ఎంపిక శిబిరాన్ని ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎన్ఆర్ఐవీఏ అమెరికా వారి ఆర్థిక సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఓరుగంటి చెన్నకేశవరావు, పఠాన్ నాగూర్ వలి శుక్రవారం వెల్లడించారు.
పట్టణంలోని కెసిపి స్టోర్స్ పక్కన ఉన్న డా. వెలగపూడి లక్ష్మణ్ దత్ ఆడిటోరియంలో ఈ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. కంభం రోటరీ ట్రస్ట్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్, కెసిపి లిమిటెడ్ మాచర్ల వారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
మాచర్లతో పాటు పరిసర గ్రామాల వికలాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పేర్ల నమోదు కోసం ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.
ముందస్తు నమోదు కోసం 9849065882, 9440002432 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
