
పాలువాయి రెవిన్యూ గ్రామానికి చెందిన రైతులందరూ తమ వ్యవసాయ భూములకు సంబంధించిన శిస్తు (land tax) బకాయిలను వెంటనే చెల్లించవలసిందిగా రెవిన్యూ శాఖ సూచించింది.
ప్రస్తుతం ప్రభుత్వం శిస్తు బకాయిలపై విధించే 6% వడ్డీని మినహాయించే అవకాశం కల్పించింది. అయితే ఈ సదుపాయం ఇప్పుడే తక్షణం చెల్లించే రైతులకు మాత్రమే వర్తిస్తుంది.
ఇప్పుడే శిస్తు బకాయిలు చెల్లించని రైతులు తర్వాత చెల్లించాల్సి వస్తే 6% వడ్డీతో పాటు శిస్తు చెల్లించవలసి ఉంటుంది అని అధికారులు తెలిపారు.
కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకుని తక్షణమే శిస్తు బకాయిలను చెల్లించుకోవాలని రెవిన్యూ శాఖ విజ్ఞప్తి చేసింది.
– రెవిన్యూ శాఖ
