
కంభంపాడు గ్రామంలో చల్లా శ్రీలత పుష్పలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ
వార్త:
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని కంభంపాడు గ్రామంలో చల్లా శ్రీలత పుష్పలంకరణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
మాచర్ల 3వ వార్డు టిడిపి అధ్యక్షులు ఉప్పుతోళ్ళ దుర్గారావు గారి మేనకోడలు, చల్లా దుర్గారావు – శ్రీమతి పార్వతి దంపతుల ప్రథమ కుమార్తె చల్లా శ్రీలత పుష్పలంకరణ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాలతో జరిగింది.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా టిడిపి బూత్ ఇన్చార్జ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
