
రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ7గా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విచారణలో భాగంగా అధికారులు ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం.
బీహార్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ స్వగ్రామం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం లాలీపురం తండా కావడం గమనార్హం.
ఈ కేసు నేపథ్యంలో సునీల్ నాయక్ విచారణకు హాజరుకావడం ప్రస్తుతం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
