
గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వెంకటరమణ ఇంట్లో నిన్న రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇటీవలే వివాహం అయిన వెంకటరమణ దంపతులు వేరే ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుమారు లక్ష రూపాయల నగదు మరియు లక్షన్నర రూపాయల విలువైన బంగారం దొంగలు అపహరించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
