

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో విద్యార్థి ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. కాలు విరిగినప్పటికీ పరీక్షను వదులుకోకుండా ధైర్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్ష రాయడానికి హాజరైన విద్యార్థి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
నడవలేని పరిస్థితిలో ఉన్న తన కుమారుడిని తల్లిదండ్రులు ఆటో చెయిర్ ద్వారా పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. చదువుపై ఉన్న మక్కువతో తీవ్ర నొప్పిని కూడా పట్టించుకోకుండా పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థిని చూసి అక్కడి వారు అభినందించారు.
ఇదిలా ఉండగా పిడుగురాళ్ల భాష్యం పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గుంటూరు తేజశ్రీ అనే విద్యార్థిని పరీక్ష రాస్తుండగా అస్వస్థతకు గురై కిందపడిపోయింది. ఆమెకు గుండెకు రంధ్రం (హార్ట్ సమస్య) ఉండటంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్లు సమాచారం. వెంటనే అక్కడి సిబ్బంది అప్రమత్తమై ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు.
వైద్య సమస్యలు, గాయాలు ఉన్నప్పటికీ విద్యపై ఉన్న ఆసక్తితో పరీక్షలకు హాజరైన విద్యార్థుల పట్టుదల అందరినీ ఆకట్టుకుంది.
