
మాచర్ల నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపిడబ్ల్యూజెఎఫ్) నూతన కమిటీ ఎన్నిక ఆదివారం పట్టణంలోని సవేరా లాడ్జి సమావేశ మందిరంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపిడబ్ల్యూజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ (ఏపిబిజెఎ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ఎన్. ప్రసాదరావు, జిల్లా నాయకులు జి. లక్ష్మీనారాయణ, కారుమంచి వెంకట నరసయ్య, పచ్చవ బుజ్జిబాబు సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
నూతన కమిటీ అధ్యక్షులుగా షేక్ మహ్మద్ ఖాశీం, కార్యదర్శిగా ఉప్పు ప్రసాద్, కోశాధికారిగా పాటిబండ్ల చెన్నకేశవ, గౌరవ అధ్యక్షులుగా ఉప్పుతోళ్ళ రమేష్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పావులూరి సతీష్ బాబు, సంయుక్త కార్యదర్శిగా షేక్ ఇమామ్, కార్యవర్గ సభ్యులుగా కోటా రవికుమార్, ఉప్పు పాపారావు, ఏ. సునీల్ కుమార్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, పెన్షన్ వంటి సంక్షేమ సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు సంఘం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను మాచర్ల నియోజకవర్గ జర్నలిస్టులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు విలేఖర్లు పాల్గొన్నారు.
