

పల్నాడు జిల్లా దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో కొలువుదీరిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 🙏
ఈ కార్యక్రమానికి మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి తనయులు గౌతమ్ రెడ్డి జూలకంటి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలను సందర్శించి తిరునాళ్ల వేడుకలను తిలకించారు.
ఈ సందర్భంగా ప్రభలపై మాట్లాడిన గౌతమ్ రెడ్డి జూలకంటి మాట్లాడుతూ, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.

టీడీపీ యువ నాయకులు శ్రీ అక్కిరెడ్డి జూలకంటి మాట్లాడుతూ, ఆత్మకూరు గ్రామంలో నిర్వహిస్తున్న వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్లు భక్తి పరవశాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుతూ, తిరునాళ్లను విజయవంతంగా నిర్వహించిన గ్రామ పెద్దలు, యువకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, టీడీపీ నాయకులు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
